కర్కాటకం
వీరికి ఆదాయం –11 వ్యయం–8, రాజపూజ్యం–5 అవమానం–4గా ఉంటుంది.
ఈ రాశి వారి పై అష్టమశని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేవలం గురు బలమే వీరికి శ్రీ రామరక్ష అని చెప్పవచ్చు. అలాగే, రాహు, కేతువులు కూడా సమపాళ్లలో ఫలితాలు ఇస్తారు.
కొన్ని విషయాలలో భావోద్వేగాలకు లోనవుతారు. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనంతో ఉపశమనం కలుగుతుంది.
బంధువులు, కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
అష్టమ శని ఫలితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండాలి. అలాగే, ప్రతి కార్యక్రమంలోనూ మరింత జాగ్రత్తలు పాటించాలి.
ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నష్టపోయే అవకాశాలున్నాయి.
గురు బలం వల్ల ఆదాయానికి లోటు లేకుండా జీవితాన్ని నడిపిస్తారు. అలాగే, శుభకార్యాలకు ఖర్చులు చేయాల్సి వస్తుంది.
చర, స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలలో చురుకుదనం కనిపిస్తుంది. మీ ప్రయత్నాలకు మిత్రుల నుండి సహాయసహకారాలు అందుతాయి.
వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటును విరమించడం మంచిది. ఉన్నవాటితోనే సంతృప్తి చెందడం అవసరం. అలాగే, లాభాలు ఆశించినమేర కనిపించవు.
బ్యాంకు రుణాలు వంటి వాటి వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.
ఉద్యోగులకు మరింత పనిభారంతో పాటు, పైస్థాయి వారి అజమాయిషీ పెరుగుతుంది. ద్వితీయార్ధంలో పదోన్నతులు తద్వారా బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా ముందుకు సాగితే అనుకున్న విజయాలు సాధించవచ్చు.
వీరికి విరివిగా విదేశీ పర్యటనలు సాగిస్తారు.
రాజకీయవర్గాలకు మొదట్లో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా ద్వితీయార్థంలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
కళాకారులు ఈ సంవత్సరం కొంత భిన్నమైన వైఖరితో అందరినీ ఆకట్టుకుంటారు. ఏ చిన్న అవకాశమైనా వదులుకోకుండా మౌనంగా స్వీకరించడం మంచిది.
రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పెట్టుబడుల్లో కొంత జాప్యం తప్పదు. పంటల పరిరక్షణకు తీసుకునే చర్యల ద్వారా అధిక వ్యయం.
విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం అంతంత మాత్రమే.
అయితే విద్యాకారకుడైన గురువు అనుకూలస్థితి వీరికి ఉపకరిస్తుంది.
న్యాయ, వైద్య, పరిశోధనారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.
చైత్రం, వైశాఖం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలిస్తాయి. మిగతావి సాధారణంగా ఉండవచ్చు.
వీరు శనికి తైలాభిషేకం, జపాలు చేయించాలి. అలాగే, ఆంజనేయ స్వామిని విరివిగా పూజించడం మంచిది.