మిథునం
వీరికి ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–2, అవమానం–4గా ఉంటుంది.
ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్ 29 వరకు, తదుపరి నవంబర్ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్ 29 నుంచి వవంబర్ 20 మధ్య కాలంలో గురుడు సప్తమ స్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి.
మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది.
ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి.
తరచూ దూర ప్రయాణాల వల్ల అలసట, ధన వ్యయం.
ఆర్థికంగా ఎంత సంపాదించినా వ్యయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు, రుణ బాధలు తప్పక పోవచ్చు.
మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావాలను చూపుతారు.
తరచూ బంధువిరోధాలు ఏర్పడి వారికి కొంత దూరంగా కావలసిన పరిస్థితి.
సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతారు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ మార్పులు చేసుకుంటారు.
అలాగే, నిర్ణయాలను సైతం మార్చుకుంటారు.
అయితే జూన్– నవంబర్ మధ్య కాలం కొంతలో కొంత అనుకూలమని చెప్పాలి. ఈ కాలంలో ఆకస్మిక ధన లబ్ధి. వివాహాది కార్యక్రమాల నిర్వహణ వంటివి చేస్తారు.
అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభ ఫలితాలు ఉంటాయి.
విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. విస్తరణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తారు.
ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అలాగే, అదనపు బాధ్యతలు మీదపడతాయి.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సత్తా చాటుకునేందుకు యత్నించినా ఫలితం కనిపించదు.
కళాకారులకు అవకాశాలు చేజారడం నిరాశ పరుస్తుంది.
టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.
క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది.
వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్య
హృదయం పఠించాలి.
చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.
అదృష్టసంఖ్య–5.