మకరం
ఆదాయం–5, వ్యయం–2, రాజపూజ్యం–2, అవమానం–4
ఈరాశి వారికి ఏల్నాటి శనిదోష ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
గురుడు తృతీయరాశిలో సంచారం అనుకూలం కాకపోయినా స్వక్షేత్రంలో ఉండడం, రజితమూర్తి కావడం వల్ల కొంతమేర శుభత్వాన్ని కలుగజేస్తాడు. ఇక రాహు కేతువుల ప్రతికూలత.
మొత్తం మీద వీరికి గురు ప్రభావంతో కొన్ని విజయాలు సాధిస్తారు.
స్నేహితులు పెరిగి ఆనందంగా గడుపుతారు.
కొన్ని అలజడులు, ఆందోళనకర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తారు.
పూర్వీకుల నుండి లభించిన ఆస్తులు మార్పులు చేయడం ద్వారా లాభపడతారు.
ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభంలో కలసి వస్తాయి.
సంప్రదాయాలను అనుసరిస్తూ కుటుంబసభ్యుల మెప్పును పొందుతారు.
విద్యార్థులకు ప్రథమార్ధంలో విజయాలు చేకూరతాయి.
సమాజశ్రేయస్సు కోసం పరితపిస్తూ, కొన్ని కార్యక్రమాలు చేపడతారు.
అయితే, శని, రాహుకేతువుల ప్రతికూల ప్రభావం ఉన్నందున అతి ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం, దూర ప్రయాణాలు సైతం వాయిదా వేయడం మంచిది.
అలాగే, ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఎప్పటికప్పుడు ఆరోగ్య సంరక్షణకు సలహాలు పాటిస్తూ ఉండడం మంచిది.
భార్యాభర్తల మధ్య అకారణంగా విరోధాలు, బంధువులతోనూ సంబంధబాంధవ్యాలు దెబ్బతింటాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మరింత ధైర్యంగా ముందుకు సాగాల్సిన సమయం.
ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో అణకువగా మసలుకుంటూ, విధులు పూర్తి చేయడం మంచిది.
కొందరికి ఆకస్మిక బదిలీలు జరిగే సూచనలు.
పారిశ్రామికవేత్తలు, శాస్త్ర, సాంకేతిక రంగాల వారు ప్రధమార్ధంలో అనుకూల పరిస్థితుల మధ్య గడుపుతారు.
చిత్రపరిశ్రమ సహా ఇతర కళారంగాల వారు ఎట్టకేలకు కొన్ని అవకాశాలు సాధించి ఊరట చెందుతారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ సామాన్యంగా ఉంటాయి.
పరిహారాలు...శని, రాహుకేతువులకు పరిహారాలు చేయడం ఉత్తమం. దుర్గామాతకు కుంకుమార్చనలు చేయండి.
అదృష్ట సంఖ్య–8.