మకరం
ఆదాయం-8 వ్యయం-14, రాజపూజ్యం-4, అవమానం-5
వీరికి మే 14 వరకు, తిరిగి అక్టోబర్ నవంబర్ మధ్య గురువు యోగకారకుడు, మిగతా కాలమంతా దోషకారి.
అలాగే, శని సంవత్సరమంతా శుభఫలితాలు ఇస్తాడు.
ఇక రాహు, కేతువుల సంచారం మిశ్రమంగా ఉంటుంది.
ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడతారు.
ఖర్చులు అధికమై అప్పులు విపరీతంగా చేస్తారు.
అయితే సమాజంలోనూ, కుటుంబంలోనూ మీ పై నమ్మకం సడలిపోదు. మీమాటే నెగ్గవచ్చు.
ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తులు దగ్గరకు చేరి సాంత్వన చేకూరుతుంది.
స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి చేరువుగా ఉంటాయి.
ఆపన్నులకు చేతనైన సహాయం అందించేందుకు ముందుంటారు.
ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించి పూర్తి చేస్తారు.
కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో సఫలత చెందుతారు.
భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది.
బంధుమిత్రులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు.
కొన్ని సేవాకార్యక్రమాలు చేపడతారు.
తరచూ ప్రయాణాలు సంభవం.
విదేశీ ప్రయాణాలు కూడా ఉండవచ్చు.
శుభకార్యాల నిర్వహణకు సమాయత్తమవుతారు.
ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు.
ఆరోగ్యం కూడా తరచూ ఇబ్బంది కలిగిస్తుంది.
వైద్యసేవలు అవసరం కావచ్చు.
కుంభంలో రాహువు, మే, అక్టోబర్, డిసెంబర్ తరువాత మిథునంలో గురువు ప్రభావంతో కొన్ని హఠాత్తు పరిణామాలు, సంఘటనలు ఎదురుకాగలవు.
రక్త, నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు కలిగే అవకాశం.
మొత్తానికి వీరు మనోనిబ్బరంతో గడపడం ఉత్తమం.
ఇక వ్యాపార, వాణిజ్య రంగాలలో సమతుల్యత పాటించాలి.
లాభాలు దక్కినా వాటిని సద్వినియోగం చేయాలి.
ఉద్యోగస్తులు విధుల పట్ల అంకితభావం చూపుతారు.
సరైన గుర్తింపు ఇంతకాలానికి దక్కుతుంది.
పారిశ్రామికవర్గాలకు ఊహించని విధంగా అనుమతుల దక్కి అగ్రిమెంట్లు కుదురుతాయి.
రాజకీయవేత్తలకు నవంబర్నెల అత్యంత శుభదాయకంగా ఉంటుంది.
కళాకారులు స్వయంగా నిర్ణయాలు తీసుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
విద్యార్థులకు ఆశించిన విధంగా ఫలితాలు రావచ్చు.
వ్యవసాయదారుల కృషి, యత్నాలు ఫలిస్తాయి.
వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం,
దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.
అదృష్టసంఖ్య-8.