వృషభం
వీరికి ఆదాయం –14, వ్యయం–11, రాజపూజ్యం 5, అవమానం–1 గా ఉంటుంది.
వీరికి ఈ ఏడాది సమస్థాయిలో ఫలితాలు ఉంటాయి.
గురువు ఏప్రిల్ వరకు గురువు అత్యంత శుభుడు. తదుపరి సాధారణ ఫలితాలు ఇస్తాడు.
అలాగే, శని మొత్తమంతా శుభఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు అక్టోబర్నుండి శుభదాయకమైనవిగా ఉంటాయి.
హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు కొన్ని పునఃపరిశీలించుకోవలసి ఉంటుంది.
సౌఖ్యం కోసం అధిక మొత్తంలో ధనఖర్చు చేస్తారు.
ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మీకు అనుకూలంగా మారతాయి.
ద్వితీయార్ధంలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు తిరిగి కొనసాగిస్తారు. అలాగే, పెద్ద వాహనాలు కొనుగోలు చేసే వీలుంది.
ధార్మిక సంస్థలు, కార్యక్రమాలకు విరివిగా విరాళాలు అందజేస్తారు.
ప్రయత్న లోపం లేకుండా విద్యార్థులు చేసే కృషి ఎంతో ఉపకరిస్తుంది.
వారికి విశేష యోగదాయకమైన కాలమని చెప్పాలి.
ఇతరుల పట్ల అణకువగా, సామరస్యంగా మెలుగుతూ కార్యాలను చక్కదిద్దుకుంటూ వెళ్లడం ఉత్తమం.
ప్రధమార్థంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించి ఖర్చులకు సిద్ధపడాలి. అయితే క్రమేపీ స్వస్థత చేకూరుతుంది.
ఇతర దేశాలకు ప్రయాణాలు సాగిస్తారు.
కొందరికి విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు రావచ్చు.
కళాకారులకు ఈ ఏడాది అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి.
వీరి పై పడిన అభాండాల నుండి బయటపడతారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ సంస్థల విస్తృతి కోసం మరింత కృషి చేస్తారు.
పెట్టుబడులకు ఎటువంటి లోటు లేకుండా జరిగిపోతుంది.
మరో వైపు లాభాలు కూడా రెట్టింపు కాగల అవకాశం.
ఉద్యోగస్తులు తమపై పడిన భారాన్ని తగ్గించుకునేందుకు తాపత్రయపడతారు.
కొందరికి విశేష పేరు రాగలదు.
సహచరులు అందించిన నమ్మకం వీరిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
రాజకీయవేత్తలు, పారిశ్రామిక రంగం వారి చిరకాల కోరిక నెరవేరవచ్చు. అయితే ప్రధమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
వివాహాది శుభకార్యాలు ద్వితీయార్థంలో కలసివస్తాయి.
వ్యవసాయదారులు మునుపటి కంటే లాభపడతారు.
వైద్యులు, సాంకేతిక రంగంలోని వారిలో మరింత భరోసా ఏర్పడుతుంది.
మహిళలకు యోగదాయకంగా గడుస్తుంది. కొంత కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తీరతాయి.
జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు కలిసి వచ్చేవి. మిగతావి సామాన్యం.
వీరు అక్టోబర్ వరకూ రాహు, కేతువులకు జపాలు వంటి పరిహారాలు చేయాలి. అలాగే, దుర్గామాతకు ఎక్కువగా పూజాదికాలు నిర్వహించాలి.